Quantcast
Channel: Kisan Updates
Viewing all articles
Browse latest Browse all 57

ఆక్వారంగానికి వార్ధా తుపాను దెబ్బ

$
0
0

వార్ధా తుపాను ప్రభావంతో వారం రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయ. దీంతో గత్యంతరం లేక యుద్ధ ప్రాతిపదికన రైతులు పట్టుబడి చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రొయ్యలు కొద్ది సంఖ్యలోనే చనిపోయనప్పటికీ.. బుధవారం మాత్రం భారీగా మృత్యువాత పడ్డాయ. ఫలితంగా పెంపకందారులు ఆందోళనలో పడ్డారు.

80 కౌంట్ నుండి 100కుపైగానే రొయ్యల పెరుగుదల ఉండటంతో ఆక్వా రైతులు భారీ నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌ను పెంచేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఏరియేటర్లను తిప్పుతున్నా ప్రయోజనం ఉండటం లేదని పెంపకందారులు వాపోతున్నారు. తుపాను తీరం దాటినా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రొయ్యలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి.

ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.30 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. ఈ తాజా పరిణామంతో రొయ్యల చెరువులు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం 40 కౌంట్ ధర 425 రూపాయలుగా ఉంటే, 80 కౌంట్‌కు దీనిలో సగం ధర కూడా రాదని రైతన్నలు రోదిస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో రొయ్యలు 40 కౌంట్‌కు వచ్చేవని, ఇప్పటికే లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టామని, కళ్ళముందు రొయ్యలు మృత్యువాత పడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ పెంచేందుకు ఎన్ని మందులు చల్లినా ప్రయోజనం లేదంటున్నారు. ఏది ఏమైనా వార్ధా తుపాను తీరం దాటినా.. దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆక్వా రంగాన్ని నట్టేట ముంచుతున్నాయి.

The post ఆక్వారంగానికి వార్ధా తుపాను దెబ్బ appeared first on Kisan Updates.


Viewing all articles
Browse latest Browse all 57

Trending Articles