పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కోట్ల చేపపిల్లల ఉత్పత్తికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టరు డాక్టర్ కాటంనేని భాస్కర్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరు కార్యాలయంలో వ్యవసాయం, పశుసంవర్ధక, మత్స్యశాఖ అధికారులతో ప్రాధాన్యరంగాల ప్రగతి తీరును కలెక్టరు సమీక్షించారు. జిల్లాలో 2017 మార్చిలోగా 15వేల కోట్ల రూపాయల విలువైన మత్ససంపద ఎగుమతులు కావడానికి చర్యలు తీసుకున్నామని, ఇందులో భాగంగా నాణ్యమైన చేపపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టరు చెప్పారు. రాష్ట్రానికి అవసరమైన చేపపిల్లలను ఉత్పత్తి చేసే కేంద్రంగా జిల్లాను తీర్చిదిద్దాలని కలెక్టరు చెప్పారు.
చేపలకు సోకేరోగాలను నిర్ధారించి వాటికి అవసరమైన నిరోధక చర్యలు చేపట్టడానికి జిల్లాలో నాలుగు ఆక్వా ల్యాబ్లను సిద్ధం చేస్తున్నామని కలెక్టరు చెప్పారు. వెటర్నరీ వర్సిటీ ఆధ్వర్యంలో ఉండిలో రూ. 5 కోట్ల వ్యయంతో ఆక్వాల్యాబ్ను ఏర్పాటు చేస్తున్నామని కలెక్టరు చెప్పారు. ఏలూరు, ఆకివీడు భీమవరంలలో రూ.
2 కోట్లతో సిద్ధంచేసిన 3 ఆక్వాల్యాబ్లను సెప్టెంబరు మొదటి వారంలో ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డాక్టర్ భాస్కర్ మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. ఎంపెడా ఆధ్వర్యంలో భీమవరంలో ఆక్వాల్యాబ్ ఏర్పాటుకు రూ. 3 కోట్ల విలువైన స్థలాన్ని భీమవరంలో కేటాయించామని, ఈ ల్యాబ్లన్నీ అందుబాటులోకి వస్తే మత్స్యసంపదకు సోకే వైరస్లను ముందుగానే గుర్తించి నివారించగలుగుతామని దానివల్ల అపారమైన మత్స్యసంపదను కాపాడుకోగలుగుతామని కలెక్టరు చెప్పారు. జిల్లాలో బుట్టాయగూడెం, ఆకివీడులలో రూ.
20 లక్షలతో నిర్మించే కమ్యూనిటీ హౌస్ను సెప్టెంబరు 11నాటికి పూర్తి చేయాలని సోషల్వెల్ఫేర్ ఇంజినీరు వెంకటరత్నంను ఆదేశించారు.
జిల్లాలో వ్యవసాయశాఖ పనితీరుపట్ల కలెక్టరు అసంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో పంటలను ఆన్లైన్ నమోదు చేయడంలో వ్యవసాయఅధికారులు తీవ్ర నిర్ల్యం ప్రదర్శిస్తున్నారని, పనితీరు మెరుగుపరచుకోకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జ్ఞానేశ్వర్, మత్స్యశాఖ డీడీ యాకూబ్భాషా, వ్యవసాయశాఖ జేడీ సాయిలక్ష్మీశ్వరీ తదితరులు పాల్గొన్నారు.
west godavari Plans ready for produce 30 crores fish seed
The post పశ్చిమ గోదావరి జిల్లాలో 30 కోట్ల చేపపిల్లల ఉత్పత్తికి సమగ్ర ప్రణాళిక appeared first on Kisan Updates.