ప్రభుత్వంలో అన్ని శాఖలు ఆన్ లైన్లో సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఆక్వా రంగం ఆన్లైన్ వైపు అడుగులు వేస్తోంది. ఆ శాఖ కమిషనర్ నుంచి క్షేత్రస్థాయి రైతు వరకూ అందరికి ఆన్ లైన్ లోనే అన్నిసేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆక్వా కల్చర్ రిజిస్ట్రేషన్స్’ ప్రక్రియను మత్య్సశాఖ నిర్వహిస్తోంది. దీంతో ఆనలైన పాలనను ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి ‘ఆన్ లైన్ రిజిస్ట్రేషన్’ ప్రారంభించారు. అయితే అధికారులకు రైతుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. వారు ఊహించిన దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులు ఆన్లైన్లో రిజిసే్ట్రషన చేసుకుని అనుమతులు పొందారు.
ఇదే తరహాలోనే నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఆనలైన ద్వారా ఆక్వా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాల్లోనూ సత్ఫలితాలొచ్చాయి! దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనలైన రిజిసే్ట్రషనను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మీ-సేవ ద్వారా ఆక్వా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని ఐటీ శాఖకు లేఖ కూడా రాశారు. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియే కాకుండా అన్ని సేవలు ఆనలైన ద్వారా అందించాలని మత్స్యశాఖ యోచిస్తోంది. సేవలతో పాటు సమాచారం కూడా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకంగా ‘వెబ్ పోర్టల్’ను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సీఎం డ్యాష్ బోర్డుకు ఒక పోర్టల్ను అనుసంధానం చేశారు. దీంతో పాటు మరో నెల రోజుల్లో కొత్త పోర్టల్ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మత్స్యశాఖకు సంబంధించిన సమాచారం అంతా వెబ్ పోర్టల్లో ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.
ఏపీ ఆన్ లైన్ సహకారంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు తమ వద్ద ఉన్న డేటాను ఏపీ ఆన్ లైన్ కు అప్పగించారు. ఈ కొత్త పోర్టల్లో మత్స్యశాఖకు సంబంధించిన స్కీమ్లు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు ఉంటాయి.
ఆన్లైన్లో ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్స్
Aquaculture Registrations in Online
The post ఆన్లైన్లో ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్స్ appeared first on Kisan Updates.