భీమవరం అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11,12,13 తేదీల్లో ‘ఫ్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ -2017’తో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు చైనా, యుకె, బ్యాంకాక్, తైవాన్, ఇండోనేషియాతో పాటు అనేక దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాయ సదస్సుకు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.
ఆనంద ఫౌండేషన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్యాంకాక్), ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగ ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతోంది. భారతదేశం నుంచి రూ.32 కోట్ల రొయ్య ఎగుమతులు ప్రతీ ఏడాది జరుగుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తోంది. పైగా అమెరికా వంటి దేశాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. సముద్ర ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలు పెరిగాయి. అంతేకాకుండా రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అన్ని దేశాల్లోని ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో అంతర్జాతీయంగ భారతదేశంలో పండించే రొయ్యతో పాటు ఇతర దేశాల్లోని చెరువుల్లో పండించే రొయ్యకు ఎదురుదెబ్బ తగులుతోంది. రొయ్య రైతులు కుదేలవుతున్నాయి. ఇక ఆ విధానానికి స్వస్ధి చెప్పి సేంద్రియ సాగును ప్రోత్సహించడం, దానికి మెళకువలు, చేపల ఉత్పత్తులను పెంచడం, అంతర్జాతీయంగ నాణ్యమైన రొయ్యలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతులు చెయ్యడం తదితర అంశాలపై 13 మంది వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు ప్రసంగాలు చేయడం జరుగుతోంది. ఆదివారం నాడు భీమవరంలో ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు ఆద్వర్యంలో ఎపి మత్య్సశాఖ కమీషనర్ రమాశంకర్ నాయక్ అధ్యక్షతన ఆర్గనైజింగ్ కమిటీ బేటి అయ్యింది. ఈ బేటిలో అనేక అంశాలపైన చర్చించడం జరిగింది.
Profit on Aquaculture 2017 in bhimavaram
The post భీమవరం లో అంతర్జాతీయ ఆక్వా కల్చర్ సదస్సు appeared first on Kisan Updates.