Quantcast
Channel: Kisan Updates
Viewing all 57 articles
Browse latest View live

భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్

$
0
0

యురోపియన్ యూనియన్ (EU) ఇండియా నుంచి వచ్చే ఆక్వా కల్చర్ ఉత్పతుల పై చేసే పరీక్షలను కఠినం చేసింది. దీని ప్రభావం ఆక్వా ఎగుమతుల పై పడనుంది. బారత్ ఆక్వా ఎగుమతులకు EU ౩ వ అతిపెద్ద మార్కెట్.

సవరించిన నిబంధనల ప్రకారం దిగుమతి చేసుకునే ఆక్వా ఉత్పత్తుల  పరిక్షల కోసం తీసుకునే నమూనాలను మొత్తం  మెటీరియల్ లో కనీసం 50 శాతం ఉండాలని బోర్డర్ ఇన్స్పెక్షన్ ను ఆదేశించింది.  ఒకే షిప్ లో వేరు వేరు కంపనీ లకు సంబందించిన ఉత్పత్తులు ఉంటె వాటిని విడి విడిగా ప్రతి కంపనీ కి సంబందించిన ఎగుమతుల్లో 50% శాంపిల్ లు తీసుకుని పరీక్షించాలని నోటిఫికేషన్ లో పేర్కొంది. ఇంతకముందు కనీసం 10 శాతం సాంపిల్స్ ను మాత్రమే పరిక్షించేవారు.

యురోపియన్ దేశాలకు చేసే ఎగుమతులు మన మొత్తం ఎగుమతుల్లో 20.71 శాతం తో మూడవ స్థానంలో ఉన్నాయి.  మొదట రెండు స్తానల్లో అమెరికా(28.46), సౌత్ ఈస్ట్ ఆసియా దేశాలు (24.59) ఉన్నాయి .  పరిమాణం ప్రకారం 2015-16 లో భారతదేశం నుంచి EU కి  ఎగుమతి అయిన ఆక్వా ఉతప్త్తులు 9,45,892 టన్నులు.

EU అధికారిక లాబ్స్  చేపట్టిన పరీక్షల ఫలితాలు లో chloramphenicol, tetracycline, oxytetracycline, chlortetracycline and metabolites of nitrofurans ల స్థాయి సాధారణం కంటే అదికం గ ఉండటం తో ఈ సవరణను అవలంబిస్తున్నారు. తమ దేశ పౌరుల ఆరోగ్య ప్రమాదాలను తగ్గించటానికి ఇండియా నుంచి వచ్చే  ఆక్వా ఎగుమతుల పై పరీక్షలను బలోపేతం చేస్తున్నాం అని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. 

దీని ప్రభావం మన ఆక్వా ఎగుమతుల పై పడుతుందని, ఎగుమతులు రిజెక్ట్ అయ్యే ప్రమాదం ఎక్కువ ఉంటుందని ఎగుమతి దారులు ఆందోళన చెందుతున్నారు.

 

భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్

 

The post భారత ఆక్వా ఉత్పత్తులపై నిబంధనలను కఠినం చేసిన యురోపియన్ యూనియన్ appeared first on Kisan Updates.


సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు

$
0
0

అమెరికా  భారత రొయ్య ఎగుమతుల పై డంపింగ్ డ్యూటీ తొలగించడం తో భారత్ సీఫుడ్ ఎగుమతులను గణనీయం గా పెంచడానికి చర్యలు తీసుకుంటుంది.  దీనిలో బాగంగా బ్లాక్ టైగర్ రొయ్యల ఎగుమతులను మరింత పెంచాలని నిర్ణయించింది. భారత సముద్ర ఎగుమతి సంస్థలు 2020 నాటికి $ 10 బిలియన్ ల ఎగుమతులను చేరుకోవాలని గమ్యంగా పెట్టుకున్నారు. ఇది ప్రస్తుతం ఉన్న $ 4.68 బిలియన్ ల కు రెండు రెట్లు అధికం. వీటిలో రొయ్యల దే అధిక బాగం. 

బ్లాక్ టైగర్ రొయ్యలు ఎగుమతికి గత సంవత్సరం తో పోల్చుకుంటే పరిమాణంలో 6.56 శాతం పెరిగింది.  మొత్తం ఉత్పత్తి 71.400 టన్నులు. బ్లాక్ టైగర్ సంయుక్త మరియు ఆగ్నేయ ఆసియాలో డిమాండ్ ఎక్కువ. మరియు వీటి త్వరిత పెరుగుదల మరియు అదిక పరిమాణం ఎగుమతులను పెంచడానికి దోహద పడుతుంది. broodstock  కేంద్రాలను మరిన్ని పెంచడం ద్వారా వీటి ఎగుమతుల పై వృద్ధి సాదించాలని MPEDA అనుకుంటుంది.   బ్లాక్ టైగర్ రొయ్యలకు సీజన్ నవంబర్ నుండి మే వరకు అనుకూలం.

సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు

Black Tiger shrimp to boost India shrimp exports

The post సీఫుడ్ ఎగుమతులను మరింత పెంచనున్న బ్లాక్ టైగర్ రొయ్యలు appeared first on Kisan Updates.

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆక్వాకల్చర్ కీలక పాత్ర

$
0
0

MPEDA తాజా లెక్కల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 9,45,892 మెట్రిక్ టన్నుల మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల ద్వారా రూ. 30,420 కోట్ల ఆదాయాన్ని పొందగలిగాము. దీనిలో ఒక్క మన రాష్ట్రం 1,67,130 మెట్రిక్ టన్నుల ఎగుమతులకు గాను రూ. 9,328 కోట్లను ఆర్జించగలిగింది. 2016-17 ఆర్థిక సంవత్సరంలో 5.6 బిలియన్ల అమెరికన్ డాలర్ల ఆదాయం వస్తుందని ఎంపిఈడిఎ అంచనా వేస్తోంది. వనామీ, బ్లాక్ టైగర్ వంటి విభిన్న వెరైటీల రొయ్యల ఎగుమతులపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆక్వా రంగంలో ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్ధతులను అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకునే వ్యూహంపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలు చేస్తోంది.

భారత్ సముద్ర ఉత్పత్తులకు ఇప్పటికీ అమెరికాయే ప్రధాన దిగుమతిదారునిగా ఉంది. అమెరికాకి దిగుమతి అయ్యే సముద్ర ఉత్పత్తుల్లో భారత్ వాటా 28.46 శాతంగా ఉంది. 1,53,695 సముద్ర ఉత్పత్తులు అమెరికా ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోంటుంది. ఆగ్నేయాసియా దేశాలు 24.59 శాతం ఉత్పత్తులను ఇక్కడ నుంచే దిగుమతి చేసుకుంటున్నాయి. ఐరోపా దేశాలు 20.71 శాతం, జపాన్ 8 శాతం, మధ్య ఆసియా 5.90 శాతం, చైనా 4.71 శాతం ఇతర దేశాలు 7.03 శాతం సముద్ర ఉత్పత్తులను భారతదేశం నుంచి దిగుమతి చేసుకుంటున్నాయి. 2015-16లో విశాఖపట్నం ఓడ రేవు నుంచి రూ. 7,161 కోట్ల విలువైన 1,28,718 టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. కృష్ణపట్నం నుంచి రూ. 2,167 కోట్ల విలువైన 38,412 కోట్ల టన్నుల మెరైన్ ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయంటే ఆక్వా ఉత్పత్తులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో అర్ధం అవుతుంది.

ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టె వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు ప్రధానమైనవని ఎంపిఈడిఏ జాయింట్ డైరెక్టర్ సిజె సంపత్‌కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెన్నై లేదా విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేసుకోవాల్సి వస్తోంది. వీటి ద్వారా రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై ప్రభావం పడుతుందని ఆయన తెలిపారు. మెరైన్ ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాల్సి ఉంటుంది. మనదేశం నుంచి దాదాపు వంద దేశాలు మెరైన్ ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలపై ఎక్కువ దృష్టి పెడతారని తెలిపారు. ఆక్వా రైతులకు తమ ఉత్పత్తులకు విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయని ఆంధ్రప్రదేశ్ రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు దువ్వూరి రాధాకృష్ణరెడ్డి చెబుతున్నారు. భారీగా ఉత్పత్తులు చేతికి వచ్చినప్పుడు రైతులు ఒత్తిడిలో వాటిని తక్కువ ధరకే వదుల్చుకొనే పరిస్థితి వస్తుందని, అటువంటి తరుణంలో ప్రాసెసింగ్ యూనిట్లు వారికి మంచి ధర వచ్చేలా ఆదుకుంటామని ఆయన తెలిపారు. బాగా సముద్ర ఉత్పత్తులు (చేపలు రొయ్యలు) లభ్యమయ్యే ప్రాంతాల్లో ప్రాసెసింగ్ యూనిట్లు వస్తే రైతుల ఉత్పత్తులకు మంచి ధర లభిస్తుందని తెలిపారు. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధికారులు స్పష్టం చేశారు. ఈ యూనిట్లు ఆరెంజ్ కేటగిరీ కింద వస్తాయని, అందువల్ల వీటి వల్ల చాలా తక్కువ కాలుష్యం ఉంటుందని అధికారులు తెలిపారు.

రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆక్వాకల్చర్ కీలక పాత్ర

Source: Andhrabhoomi

The post రాష్ట్ర ఆర్థిక అభివృద్ధిలో ఆక్వాకల్చర్ కీలక పాత్ర appeared first on Kisan Updates.

ఏపీలో మెరైన్‌ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు

$
0
0

ఆక్వా రంగాన్ని ప్రోత్సహించేందుకు ఏపీ ప్రభుత్వం చేపడుతున్న చర్యలు ఫలితంగా మెరైన్‌ (సముద్ర) ఉత్పత్తుల ఎగుమతిలో రాష్ట్రo దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచింది. ఎంపెడా విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశవ్యాప్తంగా 9.45 లక్షల మెట్రిక్‌ టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా, కేవలం ఏపీ నుంచే 1.67 లక్షల మెట్రిక్‌ టన్నుల ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఈ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా దేశవ్యాప్తంగా రూ.30,420.83 కోట్లు ఆదాయం లభించగా మన రాష్ట్రం నుంచి రూ.9,328 కోట్ల ఆదాయం లభించింది. దేశంలో మెరైన్‌ కార్గోలను పంపించే మేజర్‌ పోర్టుల్లో విశాఖపట్నం ప్రధానమైనది.

విశాఖపట్నంలో 61 మంది సముద్ర ఉత్పత్తుల ఎగుమతి దారులు రిజిస్టర్‌ అయిన ఉన్నారు. వీరి ద్వారా 2015 – 16లో విశాఖపట్నం ఓడరేవు నుంచి రూ.7,161 కోట్లు విలువైన 1.28 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడానికి ఈ ఎగుమతులు చాలా వరకూ తోడ్పాటునందిస్తున్నాయి. సముద్ర ఉత్పత్తుల ఎగుమతుల్లో అత్యధిక వాటా రొయ్యలదే. వనామీ, బ్లాక్‌ టైగర్‌ వంటి అంతర్జాతీయంగా డిమాండ్‌ ఉన్నటు వంటి రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్వా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఆధునిక పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు ఏపీ సర్కార్‌ వ్యూహరచన చేస్తోంది.

ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చి పెట్టే వాటిలో ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులు తమ ఉత్పత్తులను చెనై్న, విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. సముద్ర ఉత్పత్తులను యూరోపియన్‌ యూనియన్‌ ప్రమాణాల ప్రకారం శుద్ధి చేయాలి. మన దేశం నుంచి దాదాపు వంద దేశాలు సముద్ర ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటున్నాయి. వారు నాణ్యత ప్రమాణాలకు అధిక ప్రాధాన్యమిస్తారు. సముద్ర ఉత్పత్తుల విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్‌ యూనిట్లు ఉపకరిస్తాయి. ఉత్పత్తి భారీగా ఉన్నప్పుడు రైతులు వాటిని తక్కువ ధరకే అమ్ముకోవలసిన పరిస్థితి ఏర్పడుతోంది. అటువంటి సమయంలో ప్రాసెసింగ్‌ యూనిట్లు ఎంతగానో ఉపయోగపడతాయి. సముద్ర ఉత్పత్తులు లభ్యమయ్యే ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్‌ యూనిట్లు ఏర్పాటుకూ ప్రయత్నాలు జరుగుతు న్నాయి. ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్ల వల్ల పర్యావరణానికి ముప్పు ఉండదని రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి స్పష్టం చేసింది. ఈ యూనిట్ల ఆరెంజ్‌ కేటగిరీ కిందకు వస్తాయని, శుద్ధి తర్వాత విడుదలయ్యే జలాలు పంటల సాగుకు కూడా ఉపయోగించుకోవచ్చని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో మెరైన్‌ బోర్డు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం మహారాష్ట్రలో మాత్రమే ఇటువంటి బోర్డు ఉంది. ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996లో మహారాష్ట్ర ప్రభుత్వం మారిటైమ్‌ బోర్డును ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్‌ బోర్డు ఏర్పాటయితే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన, ఓడరేవుల నిర్వహణ, వాటి అభివృద్ధి, పోర్టుల్లో ట్రాఫిక్‌ నియంత్రణ, సముద్ర జలాలకు సంబంధించిన వ్యవహరాలను ఈ బోర్డు చూసుకుంటుంది

Source : Surya

The post ఏపీలో మెరైన్‌ బోర్డు ఏర్పాటు దిశగా అడుగులు appeared first on Kisan Updates.

భీమవరం లో అంతర్జాతీయ ఆక్వా కల్చర్ సదస్సు

$
0
0

భీమవరం అంతర్జాతీయ సదస్సుకు వేదికకానుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 11,12,13 తేదీల్లో ‘ఫ్రాఫిట్ ఆన్ ఆక్వా కల్చర్ -2017’తో అంతర్జాతీయ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు చైనా, యుకె, బ్యాంకాక్, తైవాన్, ఇండోనేషియాతో పాటు అనేక దేశాలకు చెందిన వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ అంతర్జాయ సదస్సుకు కేంద్ర మంత్రులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.

ఆనంద ఫౌండేషన్, ఏషియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (బ్యాంకాక్), ఆంధ్రప్రదేశ్ మత్య్సశాఖ, శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ విశ్వవిద్యాలయం సంయుక్తంగ ఈ అంతర్జాతీయ సదస్సును నిర్వహించబోతోంది. భారతదేశం నుంచి రూ.32 కోట్ల రొయ్య ఎగుమతులు ప్రతీ ఏడాది జరుగుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తోంది. పైగా అమెరికా వంటి దేశాల నుంచి డిమాండ్ పెరుగుతోంది. సముద్ర ఉత్పత్తులను కొనుగోలు చేసే దేశాలు పెరిగాయి. అంతేకాకుండా రొయ్యల సాగులో యాంటిబయోటిక్స్ వినియోగం ఎక్కువగా ఉంది. అన్ని దేశాల్లోని ఇదే పరిస్ధితి నెలకొంది. దీంతో అంతర్జాతీయంగ భారతదేశంలో పండించే రొయ్యతో పాటు ఇతర దేశాల్లోని చెరువుల్లో పండించే రొయ్యకు ఎదురుదెబ్బ తగులుతోంది. రొయ్య రైతులు కుదేలవుతున్నాయి. ఇక ఆ విధానానికి స్వస్ధి చెప్పి సేంద్రియ సాగును ప్రోత్సహించడం, దానికి మెళకువలు, చేపల ఉత్పత్తులను పెంచడం, అంతర్జాతీయంగ నాణ్యమైన రొయ్యలు, సముద్ర ఉత్పత్తులను ఎగుమతులు చెయ్యడం తదితర అంశాలపై 13 మంది వ్యాపారవేత్తలు, శాస్తవ్రేత్తలు ప్రసంగాలు చేయడం జరుగుతోంది. ఆదివారం నాడు భీమవరంలో ఆనంద ఫౌండేషన్ చైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు ఆద్వర్యంలో ఎపి మత్య్సశాఖ కమీషనర్ రమాశంకర్ నాయక్ అధ్యక్షతన ఆర్గనైజింగ్ కమిటీ బేటి అయ్యింది. ఈ బేటిలో అనేక అంశాలపైన చర్చించడం జరిగింది.

Profit on Aquaculture 2017 in bhimavaram

The post భీమవరం లో అంతర్జాతీయ ఆక్వా కల్చర్ సదస్సు appeared first on Kisan Updates.

ఆన్‌లైన్‌లో ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్స్

$
0
0

ప్రభుత్వంలో అన్ని శాఖలు ఆన్ లైన్లో సేవలు అందిస్తున్నాయి. ఇప్పుడు ఆక్వా రంగం ఆన్‌లైన్ వైపు అడుగులు వేస్తోంది. ఆ శాఖ కమిషనర్‌ నుంచి క్షేత్రస్థాయి రైతు వరకూ అందరికి ఆన్ లైన్ లోనే అన్నిసేవలు అందించేందుకు సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ‘ఆక్వా కల్చర్‌ రిజిస్ట్రేషన్స్’ ప్రక్రియను మత్య్సశాఖ నిర్వహిస్తోంది. దీంతో ఆనలైన పాలనను ఇక్కడి నుంచే ప్రారంభించాలని ఆ శాఖ అధికారులు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా పశ్చిమగోదావరి జిల్లా నుంచి ‘ఆన్ లైన్ రిజిస్ట్రేషన్’ ప్రారంభించారు. అయితే అధికారులకు రైతుల నుంచి అనూహ్య స్పందన ఎదురైంది. వారు ఊహించిన దానికంటే తక్కువ సమయంలో ఎక్కువ మంది రైతులు ఆన్‌లైన్‌లో రిజిసే్ట్రషన చేసుకుని అనుమతులు పొందారు.

ఇదే తరహాలోనే నెల్లూరు, కృష్ణా జిల్లాల్లో కూడా ఆనలైన ద్వారా ఆక్వా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ రెండు జిల్లాల్లోనూ సత్ఫలితాలొచ్చాయి! దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆనలైన రిజిసే్ట్రషనను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మీ-సేవ ద్వారా ఆక్వా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పించాలని ఐటీ శాఖకు లేఖ కూడా రాశారు. కేవలం రిజిస్ట్రేషన్ ప్రక్రియే కాకుండా అన్ని సేవలు ఆనలైన ద్వారా అందించాలని మత్స్యశాఖ యోచిస్తోంది. సేవలతో పాటు సమాచారం కూడా రైతులకు అందుబాటులో ఉంచేందుకు ప్రత్యేకంగా ‘వెబ్‌ పోర్టల్‌’ను కూడా సిద్ధం చేస్తోంది. ఇప్పటికే సీఎం డ్యాష్‌ బోర్డుకు ఒక పోర్టల్‌ను అనుసంధానం చేశారు. దీంతో పాటు మరో నెల రోజుల్లో కొత్త పోర్టల్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. మత్స్యశాఖకు సంబంధించిన సమాచారం అంతా వెబ్‌ పోర్టల్‌లో ఉండే విధంగా అధికారులు ప్రణాళికలు రచిస్తున్నారు.

ఏపీ ఆన్ లైన్ సహకారంతో దీనిని రూపొందిస్తున్నారు. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు తమ వద్ద ఉన్న డేటాను ఏపీ ఆన్ లైన్ కు అప్పగించారు. ఈ కొత్త పోర్టల్‌లో మత్స్యశాఖకు సంబంధించిన స్కీమ్‌లు, ప్రభుత్వ నిర్ణయాలు, పథకాలు ఉంటాయి.

ఆన్‌లైన్‌లో ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్స్

Aquaculture Registrations in Online

The post ఆన్‌లైన్‌లో ఆక్వాకల్చర్ రిజిస్ట్రేషన్స్ appeared first on Kisan Updates.

Over one lakh hectares of aqua ponds Harvesting postponed

$
0
0

Aqua business in Krishna district is effected due to Demonetisation  where export of the freshwater fish production has come to a halt.

Harvesting of two freshwater fish species – rohu and catla – had to be postponed in over one lakh hectares of aqua ponds and in the areas of its neighbouring West Godavari district. Rohu and catla are the most economically important fish species which are cultivated in Krishna district. Above 80 per cent of the production of freshwater fish species is being exported to Kolkata and Odisha states.

“Price of rohu and catla at the domestic market has fallen drastically owning to the impact of demonetisation. The price fall of the two species this year is 20 per cent when compared to the last season,” Central Institute of Freshwater Aquaculture senior scientist B. Seshagiri has told The Hindu.

However, Mr. Seshagiri has opined that the impact of the demonetisation will be less on those who could manage the expenditure to postpone the harvesting of the fish.

Ironically, farmers of Kaikaluru, Mandavalli and other areas surrounding the Kolleru lake are the worst affected as freshwater aquaculture has been thriving in this region over the years.

Lack of work

Aquaculture farmers have observed they are unable to provide work to those who depend on aquaculture due to lack of work in the wake of postponement of fish harvesting.

Several thousands of workers directly depend on aquaculture ponds for daily wages including collection and loading of the fish.

 

Over one lakh hectares of aqua ponds Harvesting postponed

Source : The Hindu

The post Over one lakh hectares of aqua ponds Harvesting postponed appeared first on Kisan Updates.

Why Indian shrimps getting better price now..?

$
0
0

Spread of a early mortality syndrome (EMS) disease in the shrimp farms of Thailand and the shortage has also  puts Indian vannamei shrimp on high table in the global market.

The Economic Times Reported

FAO report on food outlook for 2013 says that it is a continuation of EMS problems experienced by Southeast Asian countries from China to Malaysia last year, which affected 80% of shrimp farms in Mekong delta with a major impact on Vietnamese producers.

Indian vannamei, produced in the farms based mostly in Andhra Pradesh, is fetching better prices now.

“The demand from US for vannamei shrimps has gone up as the production in Thailand has come down. The prices have jump ..

Higher demand and prices are likely encourage aquaculture farms to produce more. The aquaculture production of shrimps in India had gone up from Rs 1.30 lakh tonne to Rs 2.50 lakh tonne last year. “It may touch Rs 3 lakh tonne in the current year,” said L Satyanarayana, president of All India Shrimp Hatchery Association. According to him, heavy rains in Andhra Pradesh have delayed the stocking of seeds in the July-August period. He expects that to happen in the August-September period.

Why Indian shrimps getting better price now..?

Source : economictimes

The post Why Indian shrimps getting better price now..? appeared first on Kisan Updates.


కాట్రేనికోన మండలంలో మొబైల్‌ ఆక్వా ల్యాబ్‌ సేవలు

$
0
0

రాష్ట్ర ప్రభుత్వం మత్స్య పరిశ్రమ అభివృద్ధి కోసం చేపట్టిన మొబైల్‌ ఆక్వా సేవలను ఆక్వా రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాకినాడ స్టేట్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిషరీస్‌ టెక్నాలజీ (ఎస్‌ఐఎఫ్‌టీ) ఎఫ్‌డీఓ డాక్టర్‌ టి. విజయభారతి సూచించారు. ఆక్వా చెరువుల వద్దే మొబైల్‌ ఆక్వా ల్యాబ్‌లో నామమాత్రపు రుసుంతో మట్టి, నీటి నాణ్యత, బాక్టీరియా పరీక్షలు చేసి నివేదికలను రైతులకు అందిస్తామన్నారు. ఈ  బృందం గురువారం కాట్రేనికోన మండల కేంద్రంలో నడవపల్లి, కందికుప్ప, కాట్రేనికోన తదితర గ్రామాలలో మొబైల్‌ ఆక్వా సేవలు అందిస్తారు. చేపలు, రొయ్యల చెరువుల రైతులు చెరువు నీటిని మొబైల్‌  లాబ్‌కు తీసుకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని ఆమె సూచించారు.

 

Mobile Aqualab services in eastgodavari

The post కాట్రేనికోన మండలంలో మొబైల్‌ ఆక్వా ల్యాబ్‌ సేవలు appeared first on Kisan Updates.

ఆక్వారంగానికి వార్ధా తుపాను దెబ్బ

$
0
0

వార్ధా తుపాను ప్రభావంతో వారం రోజులుగా నెలకొన్న వాతావరణ మార్పులు ఆక్వా రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఆక్సిజన్ అందక రొయ్యలు పెద్ద సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయ. దీంతో గత్యంతరం లేక యుద్ధ ప్రాతిపదికన రైతులు పట్టుబడి చేస్తున్నారు. సోమ, మంగళవారాల్లో రొయ్యలు కొద్ది సంఖ్యలోనే చనిపోయనప్పటికీ.. బుధవారం మాత్రం భారీగా మృత్యువాత పడ్డాయ. ఫలితంగా పెంపకందారులు ఆందోళనలో పడ్డారు.

80 కౌంట్ నుండి 100కుపైగానే రొయ్యల పెరుగుదల ఉండటంతో ఆక్వా రైతులు భారీ నష్టాలను చవి చూడాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆక్సిజన్‌ను పెంచేందుకు రాత్రి, పగలు తేడా లేకుండా ఏరియేటర్లను తిప్పుతున్నా ప్రయోజనం ఉండటం లేదని పెంపకందారులు వాపోతున్నారు. తుపాను తీరం దాటినా ఆకాశం మేఘావృతమై చల్లటి గాలులతో కూడిన వర్షం పడుతుండటంతో రొయ్యలు పెద్ద ఎత్తున మృత్యువాత పడుతున్నాయి.

ఒక్క కృష్ణా జిల్లాలోనే 1.30 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేపట్టారు. ఈ తాజా పరిణామంతో రొయ్యల చెరువులు పూర్తి స్థాయిలో ఖాళీ అయ్యే ప్రమాదం నెలకొంది. ప్రస్తుతం 40 కౌంట్ ధర 425 రూపాయలుగా ఉంటే, 80 కౌంట్‌కు దీనిలో సగం ధర కూడా రాదని రైతన్నలు రోదిస్తున్నారు. ఇంకా నెల రోజుల్లో రొయ్యలు 40 కౌంట్‌కు వచ్చేవని, ఇప్పటికే లక్షలాది రూపాయలను పెట్టుబడి పెట్టామని, కళ్ళముందు రొయ్యలు మృత్యువాత పడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్సిజన్ పెంచేందుకు ఎన్ని మందులు చల్లినా ప్రయోజనం లేదంటున్నారు. ఏది ఏమైనా వార్ధా తుపాను తీరం దాటినా.. దాని ప్రభావంతో కురుస్తున్న వర్షాలు ఆక్వా రంగాన్ని నట్టేట ముంచుతున్నాయి.

The post ఆక్వారంగానికి వార్ధా తుపాను దెబ్బ appeared first on Kisan Updates.

ఆక్వా రైతులకు పన్ను మినహాయింపు లభించేలా కృషిచేస్తా : వ్యవసాయ శాఖ మంత్రి

$
0
0

ఆక్వా రైతాంగానికి ఆదాయ పన్ను మినహాయింపు లభించేలా కృషిచేస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రకటించారు. ఈ రంగంలో కూడా సన్న, చిన్నకారు రైతులున్నారని, వారి కోసం నిబంధనలు సడలించి, వరి రైతు తరహాలో ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని కేంద్రాన్ని కోరతామన్నారు.

ఆక్వా రైతాంగాన్ని కూడా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనలో చేర్చాలని కోరతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఈ అంశాలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని మంత్రి చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఆక్వా రైతులు, ఆక్వా ట్రేడర్స్ సమస్యలపై సోమవారం నిర్వహించిన సమావేశంలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆక్వా రంగం అంటే చాలా ఇష్టమన్నారు. గతం కంటే ఇప్పుడు ఎంతగానో ఈ రంగం వృద్ధి సాధిస్తోందన్నారు.

రాష్ట్రం నుండి ఏటా 27 లక్షల టన్నుల ఆక్వా ఉత్పత్తుల లక్ష్యంకాగా ప్రస్తుతం 17 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతోందన్నారు. ఆక్వా ఉత్పత్తుల ప్రోత్సాహానికి రైతులకు త్రీ ఫేజ్ విద్యుత్ యూనిట్ రూ.3.70కు అందిస్తున్నామన్నారు. ఈ రంగంలో నిపుణుల కొరతను తీర్చడంలో భాగంగా వచ్చే విద్యాసంవత్సరం నుంచ ఫిషరీస్ పాలిటెక్నిక్ కళాశాలను ప్రభుత్వం ప్రారంభించనుందని ప్రకటించారు. ప్రైవేటు కళాశాలల్లో కూడా ఆక్వా కోర్సులు ప్రవేశపెడుతున్నట్లు చెప్పారు.

The post ఆక్వా రైతులకు పన్ను మినహాయింపు లభించేలా కృషిచేస్తా : వ్యవసాయ శాఖ మంత్రి appeared first on Kisan Updates.

Ericsson demonstrates IoT solutions in MORI village, Andhra Pradesh

$
0
0

Leading technology player Ericsson demonstrated its Connected Aquaponics and Smart Water Grid Management IoT solutions on site in Mori village as part of a pilot being run by the Govt. Of Andhra Pradesh towards creating smart and sustainable villages in the state. Both the projects were demonstrated on site in the presence of Shri N. Chandra Babu Naidu, Hon’ble Chief Minister, Govt of Andhra Pradesh , following a three month pilot. Ericsson had earlier in the year signed an MoU with the Govt of Andhra Pradesh and UC Berkley to  help improve lives of farmers in and around Mori.

smart-aquaponics
Under the connected aquaponics system, sensors and actuators measure water quality, flow, and levels, and automatically distribute water depending on the needs of each farmer. This system can also help reduce problems during monsoon season and during flood events. Using LoRa and LPWAN connectivity, the actuators are used to automatically open and close the gates of the river flow system to distribute the water as per needs of the farmers. Such a system helps in better management in Flood like situations. This also helps in regulating the flow of sea water and prevents it from entering the fresh water system. Thus,  water is used efficiently and the wastage is minimised. The entire operation is integrated into a centralised command and control system for efficient management at different levels – Panchayat, Taluk, District and State.

The result is higher farming yields while reducing costs through use of raw materials and recycled water at the natural Godavari basin.

 

Source : Mobility India,  rtinsights

The post Ericsson demonstrates IoT solutions in MORI village, Andhra Pradesh appeared first on Kisan Updates.

New viral disease detected in vannamei shrimp

$
0
0

A new virus affecting vannamei shrimp, so far known only to Thailand and Vietnam, has been detected by the department of Marine Living Resources of Andhra University, Visakhapatnam.

The virus has been affecting over Rs 1,000 crore worth shrimps every year.

The dual infection caused by the viral disease known as Abdominal Segment Deformity Disease (ASDD) and microsporidian Enterocytozoon hepatopenaei (EHP) has been affecting the growth and life of the Vannamei shrimps, Hans India informed.

Litopenaeus Vannamei was introduced in India in 2008, when aquaculture has reached its peak. Both the diseases were detected in brooders in Thailand and Vietnam in 2012 and the AU department found the diseases in 2015 and after several field tests it was confirmed recently.

Some hatchery owners directly import from Hawaii and set into production without screening. This could be one reason for spreading the diseases all over,” said Prof R Janakiram of the Marine Living Resources department.

A new probiotic discovered

Meanwhile, a research scholar of the department, Gandham Krishna Geetha discovered a new probiotic, which could be resistant to many diseases.

The scientist managed to isolate a new strain of Bacillus cereus from the gut of wild Penaeus monodon brooder and proved to be antagonistic to Vibrio harveyi, and can be used as a feed probiotic in shrimp after field trials.

The discovery has been informed to National Centre for Biotechnology Information.

In Janakiram’s opinion, the commercial application of this new probiotic will give fresh impetus to the aquaculture industry in India.

 

New viral disease detected in vannamei shrimp

Source : The Hans India, FIS

 

The post New viral disease detected in vannamei shrimp appeared first on Kisan Updates.

వైట్ స్పాట్ నిర్దారణకు తక్కువ ఖర్చుతో వేగవంతమయిన పరీక్ష

$
0
0

వైట్ స్పాట్ డిసీజ్ ప్రపంచ వ్యాప్తంగా వెనామీ రైతులకు నష్టాలను కలుగచేస్తున్నది.  ఇండియా లోనే ప్రతి సంవత్సరం  1800 కోట్లు నష్టాలు దీని  వల్ల  వస్తున్నాయి.  వైట్ స్పాట్ సిండ్రోమ్ వైరస్  (WSSV ) వల్ల  ఈ వ్యాధి రొయ్యల్లో వ్యాపిస్తుంది.  PCR టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని లాబొరేటరీలో  నిర్దారిస్తారు. దీనికి 3 – 5 రోజుల సమయం పడుతుంది. ఈ వ్యాధి ని  నిర్దారించే లోపు ఇది మరింతగా వ్యాప్తిస్తుంది.

20 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ

అగార్కర్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్( ARI ) శాస్త్రవేత్తలు   త్వరిత గతిన కేవలం 20 నిమిషాల్లో చెరువు దగ్గరే పరీక్షించుకునే విధంగా ఓక స్ట్రిప్ ను తయారు చేసారు. దీని పై  రొయ్య గ్రిల్ పై ఉండే ద్రవాన్ని  ఈ స్ట్రిప్ పై వేస్తె 20 నిమిషాల్లో ఇది వ్యాధిని నిర్దారిస్తుంది.  దీని ద్వారా చాలా ముందు స్టేజ్ లోనే వైట్ స్పాట్ వ్యాధి నివారణకు అవకాశం ఉంటుంది.

strip

ARI డైరెక్టర్ కిశోర్  మాట్లాడుతూ, వైట్ స్పాట్ డిసీజ్ త్వరితగతిన అంటే కేవలం 3 నుంచి 10 రోజుల్లో మొత్తం అన్ని రొయ్యలకు వ్యాపిస్తుంది.  ప్రస్తుతం లాబొరేటరీలో చేసే టెస్ట్ కు ఎక్కువ సమయం మరియు నిపుణులు, పరికరాలు అవసరం అంతేకాకుండా ప్రతి శాంపిల్ కు 1000 రూపాయలు వరకు అవుతుంది.

అతి తక్కువ ఖర్చు

ARI కనిపెట్టిన విధానంలో కేవలం 100 నుంచి  200 రూపాయల ఖర్చుతో ఒక చిన్న స్ట్రిప్ సహాయంతో చెరువు దగ్గరే రైతు 20 నిమిషాల్లో వ్యాధి నిర్దారణ చేయవచ్చు.  అంతే కాకుండా హేచరీ మరియు లేబొరేటరీలు కలిసి రైతులకు తప్పుడు ఫలితాలు ఇవ్వడం ద్వారా రైతుల మోసపోకుండా నివారించవచ్చు.

 

Rapid Detection of White Spot Syndrome Virus

The post వైట్ స్పాట్ నిర్దారణకు తక్కువ ఖర్చుతో వేగవంతమయిన పరీక్ష appeared first on Kisan Updates.

శీతాకాలం లో వెనామీ సీడ్ కొనుగోలు చేయవద్దు – MPEDA

$
0
0

శీతాకాలం నందు రొయ్యల రైతులు సీడ్ ను స్టాక్ పెట్టుకోవద్దని MPEDA అధికారులు సూచించారు. అంతే కాకుండా ఈ కా లం లో యాంటీ బయోటిక్స్ వాడొద్దని రైతులకు  విజ్ఞప్తి చేస్తున్నారు.

డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు బాగా తగ్గడం వల్ల  WSSE, IHHNV అనే వైరస్ లు సీడ్ ను దెబ్బతీస్తాయి.  ఎంపెడా చైర్మన్ జయ తిలక్ ఆదేశాల తో ఐదు బృందాలు చెరువుల దగ్గరకు వచ్చి రైతులకు సలహాలు సూచనలు ఇస్తున్నారు.

ఆక్వా రైతులు శీతాకాలం నందు రొయ్య పిల్లలను కొనుగోలు చేస్తే చనిపోతాయి అందువల్ల  చెయ్యవద్దు. ఈ సమయం లో కేవలం చెరువులను సిద్ధం చేసుకోవటం మాత్రమే చెయ్యాలి. మన దేశం లో రైతులు ఉత్తమ ప్రమాణాలతో రోయ్య ల  పెంపకం చేస్తున్నారు, కెమికల్స్ వాడకుండా కల్చర్ చెయ్యాలని దీని ద్వారా అంతర్జాతీయ మార్కెట్ లో మంచి ధరను పొందవచ్చు అని చెప్పారు.

 

The post శీతాకాలం లో వెనామీ సీడ్ కొనుగోలు చేయవద్దు – MPEDA appeared first on Kisan Updates.


మొబైల్ ఆక్వా ల్యాబ్ ను ప్రారంభించిన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్

$
0
0

ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా రూ.18 లక్షలతో  ఆక్వా రైతాంగం కోసం మొబైల్ ల్యాబ్‌ను ల్యాబ్‌ను ఎస్‌బిఐ జిఎం రవీంద్ర పాండే  ప్రారంభించారు.  ఈ మొబైల్ ల్యాబ్ ద్వారా శాస్తవ్రేత్తలు వారి సమస్యలను పరిష్కరిస్తారని జిఎం చెప్పారు. దేశానికి వేలాది కోట్ల రూపాయల ఆదాయాన్ని తీసుకువస్తున్న ఆక్వా రైతాంగానికి మొబైల్ ల్యాబ్ చాలా అవసరమని గుర్తించి ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

 

ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఛైర్మన్ ఉద్దరాజు కాశీ విశ్వనాధరాజు మాట్లాడుతూ రొయ్యలు, చేపల రైతులు వాటికి వచ్చే వ్యాధులు వల్ల కోట్లాది రూపాయలు నష్టపోతున్నారని, అందుకోసం వారి చెరువుల వద్దకే వెళ్లి శాస్తవ్రేత్తలు పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. నీటి పరీక్షలతో పాటు సాల్ట్, నైట్రేట్, ఆక్సిజన్, అమ్మోనియా, మైక్రో బయోలజీ వంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారని ప్రకటించారు. ఇటీవల కాలంలో రొయ్యల పెంపకంలో యాంటిబయోటిక్స్ ఎక్కువగా వినియోగిస్తున్నారని, వీటి వినియోగం నుంచి ఆక్వా రైతాంగానికి సేంద్రీయ పద్ధతులకు తీసుకువచ్చి చైతన్యం కల్పించడమే మొబైల్ ల్యాబ్ లక్ష్యమన్నారు

The post మొబైల్ ఆక్వా ల్యాబ్ ను ప్రారంభించిన ఉద్దరాజు ఆనందరాజు ఫౌండేషన్ appeared first on Kisan Updates.

US government cuts anti-dumping duty on shrimp exports

$
0
0

The United States commerce department has announced the preliminary determinations in the ongoing 11th administrative reviews of the anti-dumping duty orders against frozen warm water shrimp from India and Thailand.

The US is the largest importer of Indian shrimps.  The new rate applies to 229 Indian producers and exporters not selected for individual examination, sources said. The review-specific average duty in the 11th round was lower than the final tenth review rates.  Because of the duty being lowered, a lot of major exporters will stand to get duty refunds, which will be a big boost for the exports.

The US is the largest market (1,34,144 tonnes) for frozen shrimp followed by the European Union (81,849 tonnes), South East Asia (65,188 tonnes), Japan (34,204 tonnes), Middle East countries (17,477 tonnes), China (9542 tonnes) and other countries (31,464 tonnes).

 

US government cuts anti-dumping duty on shrimp exports

Source:  Business Standard

The post US government cuts anti-dumping duty on shrimp exports appeared first on Kisan Updates.

Viewing all 57 articles
Browse latest View live