ఆక్వా కల్చర్లో రాష్ట్రం సత్తా ప్రపంచానికి చాటేలా ఏర్పాటవుతున్న భారత అంతర్జాతీయ సముద్ర ఆహార ఉత్పత్తుల ప్రదర్శన శుక్రవారం విశాఖలో ప్రారంభం కానుంది. ప్రపంచంలో అత్యధికంగా మత్స్య ఉత్పత్తులు ఎగుమతి చేసే దేశాల్లో భారత ప్రథమస్థానంలో ఉంది. ఈ విషయంలో పోటీపడే చైనాను పక్కకు నెట్టి ఇటీవల వియత్నాం ముందుకువస్తోంది. గత ఏడాది మన దేశం నుంచి 36 వేల కోట్ల విలువైన సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. ఇందులో రాష్ట్ర వాటా 40 శాతం. సుమారుగా 15 వేల కోట్ల విలువైన మత్స్య సంపద రాష్ట్రం నుంచి ఎగుమతికాగా అందులో 60 శాతం ఆక్వాకల్చర్ ద్వారా ఉత్పత్తి చేసిన వనామీ రొయ్యలు ఉండడం గమనార్హం.
మత్స్య పరిశ్రమను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆర్థిక వృద్ది ప్రధాన కారకంగా గుర్తించింది. ఈ ఏడాది 40,200కోట్ల విలువైన 26.40లక్షల టన్నుల ఉత్పత్తిని లక్ష్యంగా ప్రభుత్వం నిర్దేశించింది. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో ప్రస్తుతం అవుతున్న ఆక్వా ఉత్పత్తులను వందశాతం పెంచాలని లక్ష్యంగా నిర్ణయించింది. అమెరికా, జపాన, ఐరోపా దేశాల్లో భారత ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంది. నాణ్యమైన ఉత్పత్తులకు భారత మరో పేరుగా మారడంతో ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడానికి అనేక దేశాలు ఆసక్తి చూపుతున్నాయి. వాటన్నింటికీ భారతదేశం సత్తా.. ముఖ్యంగా ఏపీ గొప్పదనం చాటేందుకు ఈ ప్రదర్శనను విశాఖపట్నంలో నిర్వహిస్తున్నారు.
‘సురక్షితమైన, సుస్థిరమైన భారతదేశపు ఆక్వాకల్చర్’ అనే నినాదంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నారు. దీనికి అమెరికా, జపాన, చైనా, తైవాన, వియత్నాం, థాయ్లాండ్ తదితర దేశాల నుంచి 71 మంది అతిథులు వస్తున్నారు. సుమారు ఏడు వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో హ్యాంగర్స్ నిర్మించారు. ఇందులో 144 స్టాళ్లు ఏర్పాటు చేశారు. వాటిలో 117 భారత కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. వీటిలో యంత్ర పరికరాలకు సంబంధించిన స్టాల్స్ 42 స్టాళ్లున్నాయి.. 102 మంది ఎగ్జిబిటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. గురువారం ఉదయానికి 1,207 మంది పేర్లు నమోదయ్యాయి. స్పాట్ రిజిసే్ట్రషన్ల ద్వారా వీరి సంఖ్య రెండు వేలకు చేరుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
ఈరోజు నుంచి విశాఖలో ఇండియాాఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో
Source : Andhrajyothi
The post ఈరోజు నుంచి విశాఖలో ఇండియాాఇంటర్నేషనల్ సీ ఫుడ్ షో appeared first on Kisan Updates.